Close

District Collector Nishant Kumar congratulated the winners from the district in the national level karate competitions.

Publish Date : 24/08/2022
District Collector Nishant Kumar congratulated the winners from the district in the national level karate competitions.

*కరాటే పోటీలో విజేతలకు అభినందించిన కలెక్టర్*

పార్వతీపురం, ఆగస్ట్ 22: జాతీయ స్థాయి కరాటే పోటీలలో జిల్లా నుంచి విజేతలుగా నిలిచిన వారికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. ఈ నెల 13, 14 తేదీ లలో సీసా ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలను బాపట్ల క్రీడా వికాస కేంద్రం లో జరిగాయి. దేశ నలుమూల నుండి 300 మంది పాల్గొనగా జిల్లా నుండి ఆరుగురు వివిధ విభాగాల్లో
ప్రతిభ కనపరిచారు. ప్రతిభ కనపరిచిన వారికి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెడల్స్ ను అందజేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కఠోర దీక్షతో సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాక్షించారు. జిల్లా ఖ్యాతిని పెంపొందించాలని అన్నారు. విజేతలుగా నిలిచిన వారిలో డి. చినబాబు – 75 కేజీ లో బంగారు పతకం, బి. జితేంద్ర అండర్ – 11, బంగారు పతకం, ఎం. స్వరూప రాణి అండర్-16, వెండి పతకం, జి. జస్వంత్ సాయి అండర్-11, రజితపతకం. ఎ. కిరణ్ కుమార్ అండర్ -10, రజతపతకం
సి.హెచ్ చిరంజీవి అండర్-19, రజితపతకం సాధించరని శిక్షకుడు సాము ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా క్రీడాధికారి ఎస్.వేకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.